వార్తలకు తిరిగి వెళ్లండి
స్కూల్ బస్సు, లారీ ఢీకొనడం

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల క్రాస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం తప్పింది. నాగార్జున విద్యాలయానికి చెందిన బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ భరత్ అజాగ్రత్తే కారణమని పోలీసులు కేసు నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...