వార్తలకు తిరిగి వెళ్లండి
బాల నేరాల పెరుగుదల

ఉమ్మడి జిల్లాలో బాల నేరస్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆన్లైన్ బెట్టింగ్, మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసై, మైనర్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. పట్టుబడిన వారు బెయిల్పై వచ్చి మళ్లీ నేరాలు చేయడం పోలీసులకు సవాలుగా మారింది.
చోరీల్లో నిమగ్నమైన మైనర్లను గుర్తించేందుకు పోలీసులు ‘జువైనల్ మ్యాపింగ్’ అమలు చేస్తున్నారు. వీరిని నేరాల నుంచి దూరం చేయాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇప్పించడంతో పాటు, మత్తు పదార్థాల సరఫరాపై నిరంతరం నిఘా అవసరం.
Comments
Loading comments...