Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఆదిలాబాద్‌ యువకులు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 09, 2026 11:15 AM ఆదిలాబాద్General
గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ఆదిలాబాద్‌ యువకులు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా సొనాల గ్రామానికి చెందిన గుడాల వాసు, అడప అరవింద్‌ ద్విచక్రవాహనంపై సుదీర్ఘ ప్రయాణం చేసి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. దేశంలోని పలు ప్రముఖ క్షేత్రాలను దర్శిస్తూ వేల కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రపంచంలోనే ఎత్తైన 5798 మీటర్ల ఉమ్లింగ్‌ లా పాస్‌ను ద్విచక్రవాహనంతో అధిరోహించి, 21 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన యువకులుగా వీరు గుర్తింపు పొందారు. వీరి సాహసయాత్రను స్థానికులు ఘనంగా అభినందించారు.

Comments

G
Loading comments...