వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా తహసీల్దార్ కార్యాలయం 1910లో నిర్మించిన శిథిలావస్థ భవనంలోనే కొనసాగుతోంది. వర్షాకాలం కావడంతో భవనం ఎప్పుడు కూలిపోతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
కొత్త భవనం కోసం శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సురక్షితమైన కొత్త భవనాన్ని త్వరగా నిర్మించాలని సిబ్బంది, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

