వార్తలకు తిరిగి వెళ్లండి
మోహన్రావు కుటుంబాన్ని పరామర్శించిన సండ్ర వెంకట వీరయ్య

సీఐటీయూ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ పెరుమల్లపల్లి మోహన్రావు కుటుంబాన్ని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మోహన్రావు సతీమణి కళావతికి నివాళులర్పించారు.
ఆరెంపుల గ్రామంలోని మోహన్రావు నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణ, కృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...