Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపఘ్ని, బాహుదా నదుల్లో ఇసుక దోపిడీ

రూపేష్ గౌడ్ Jul 11, 2026 6:40 AM కడప 2 viewsabout 1 hour ago
పాపఘ్ని, బాహుదా నదుల్లో ఇసుక దోపిడీ - Udayam Digital
అధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా వేంపల్లె, సుండుపల్లి పరిసరాల్లో అక్రమార్కులు యంత్రాలతో ఇసుకను కొల్లగొడుతున్నారు. పాపఘ్ని, బాహుదా నదుల నుంచి ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా స్థానిక ప్రాంతాలతో పాటు బెంగళూరుకు కూడా అక్రమంగా తరలిస్తున్నారు. వర్షాభావం, ఎల్‌నినో పరిస్థితుల్లో ఈ దందాతో భూగర్భ జలాలు అడుగంటి వేంపల్లె, వేముల పరిధిలోని 18 గ్రామాలకు తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...