వార్తలకు తిరిగి వెళ్లండి
కోరుకొండలో అన్నదానానికి తిప్పలు

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యన్నదానం ఇరుకు షెడ్డులోనే నిర్వహిస్తుండటంతో భక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. భోజన వసతి కేవలం 45 మందికే సరిపోవడంతో పర్వదినాల్లో వందలాది మంది భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విశాలమైన అన్నదాన హాలు నిర్మించాలని కోరుతున్నారు. ఆలయానికి పూర్తిస్థాయి ఈవో, పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని వాపోతున్నారు.
Comments
Loading comments...