వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
స్టాక్ మార్కెట్ పేరిట మోసం

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి రూ.37 కోట్లకు పైగా మోసం చేసిన ఇద్దరు నిందితులను సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడలో కార్యాలయం తెరిచి వేలాది మంది నుంచి దాదాపు రూ.98 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.
సకాలంలో సొమ్ములు చెల్లించకుండా బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సాక్ష్యాలతో రావాలని, నిందితుల ఆస్తులపై దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...