వార్తలకు తిరిగి వెళ్లండి
చేత్త బళ్ల ఇంధన బిల్లుల దందా

పంచాయతీల్లో చెత్త బళ్ల పెట్రోల్, డీజిల్ ఖర్చుల పేరిట రూ.2.54 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ అంతర్గత ఆడిట్లో వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో బిల్లులు డ్రా చేయడంతో నిధుల దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టారు.
ఈ అక్రమాలపై జిల్లావ్యాప్తంగా 68 మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో తాఖీదులు జారీ చేశారు. సరైన ఆధారాలు, బిల్లులు చూపించకపోతే సంబంధిత మొత్తం రికవరీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...