Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక మాఫియా దారుణం: ఇద్దరు బలి

రూప దేవి Jul 23, 2026 6:29 AM కడపin about 4 hours
ఇసుక మాఫియా దారుణం: ఇద్దరు బలి - Udayam Digital
వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలం ఉప్పరపల్లె సమీపంలో ఇసుక టిప్పర్ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు గొర్రెల వ్యాపారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సంతకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను జయరామ, రవీంద్రగా గుర్తించారు. కూటమి నేతల ఇసుక మాఫియా ఆగడాల వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...