Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాద్రిపురంలో రేపు సామూహిక వరలక్ష్మి వ్రతం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:31 PM కడపGeneral
సింహాద్రిపురంలో రేపు సామూహిక వరలక్ష్మి వ్రతం - Udayam
సింహాద్రిపురం మండలం నిడువెలగల ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణరెడ్డి, అర్చకులు మధుసూదన్‌రావు తెలిపారు. వ్రతంలో పాల్గొనే భక్తులు అరగంట ముందుగా ఆలయానికి హాజరుకావాలని అర్చకులు కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...