వార్తలకు తిరిగి వెళ్లండి
సాయికృష్ణ అదృశ్యం కేసు వాయిదా
రాజిత దేవి Jun 24, 2026 7:06 AM విజయవాడ 7 viewsabout 17 hours ago

సాయికృష్ణ అదృశ్యం కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్పై విచారణను హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. నిందితుడైన సీఐ నాగరాజును అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
దర్యాప్తు కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేశామని ఏజీ పేర్కొన్నారు. విచారణ పారదర్శకంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించిన నేపథ్యంలో, తదుపరి పరిణామాల కోసం వేచి చూస్తామని ధర్మాసనం పేర్కొంది.
Comments
Loading comments...