వార్తలకు తిరిగి వెళ్లండి
సాయికృష్ణ మృతి కేసు: లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు

గాదె సాయికృష్ణ మృతి కేసులో నిందితులుగా ఉన్న హెడ్కానిస్టేబుళ్లు అశోక్, నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. వీరు ప్రధాన నిందితుడైన సీఐ నాగరాజుకు సహకరించినట్లు సిట్ విచారణలో తేలింది.
నాగరాజు అరెస్ట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణ మృతికి సంబంధించి వీరి పాత్రపై పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.
Comments
Loading comments...