వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనర్ ఆదేశం

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ప్రజా ఫిర్యాదుల వేదికలో 17 అర్జీలను స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘుతో పాటు పలువురు నగరపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...