వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణంలో పలు చేపలు, మాంసం దుకాణాలపై పురపాలక అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ రత్నకుమార్ ఆదేశాలతో శానిటరీ ఇన్స్పెక్టర్ 19దుకాణాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచని యజమానులకు జరిమానాలు విధించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నాణ్యమైన ఉత్పత్తులు విక్రయించాలని, పరిశుభ్రత పాటించాలని యజమానులను అధికారులు ఆదేశించారు.
Comments
Loading comments...

