Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కోసం అన్నదాతల 'రణభేరి': మల్యాల హైవేపై ఉద్రిక్తత

nerella Srinivas Jul 21, 2026 9:35 AM జగిత్యాలabout 8 hours ago
సాగునీటి కోసం అన్నదాతల 'రణభేరి': మల్యాల హైవేపై ఉద్రిక్తత - Udayam Digital
సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో రైతులు కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఈ నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌లను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారం రోజుల్లో వరద కాలువకు నీళ్లు ఇవ్వకపోతే కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.

Comments

G
Loading comments...