Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.11వేలు పలికిన లడ్డూ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 8:38 PM శ్రీకాకుళంGeneral
రూ.11వేలు పలికిన లడ్డూ - Udayam
కవిటి మండలం కుసుంపురంలో మాతృమూర్తి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను గ్రామానికి చెందిన చిన్నాలి నవీన్ రూ.11,111కు బుధవారం వేలంలో దక్కించుకున్నారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని పేదలకు అందజేస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...