వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరునగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. దుర్గా నగర్ కాలనీలో టీడీపీ నేత వరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి సీఎం రూ.110 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఇందులో రూ.80 కోట్లు రోడ్లకు, రూ.20 కోట్లు లైట్లకు, రూ.10 కోట్లు డ్రైనేజీలకు కేటాయించినట్లు చెప్పారు.
Comments
Loading comments...

