వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలం కొండపోలేరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు MGNREGS నిధులతో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ రహదారి వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

