వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడిలో కనీసం తొమ్మిది మంది మృతిచెందగా, 22 మంది గాయపడ్డారు. దాడులతో నివాస భవనాలు దెబ్బతిని పలు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
సహాయక బృందాలు పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ దాడికి రెండు రోజుల ముందే జరిగిన మరో భారీ దాడిలో 10 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

