వార్తలకు తిరిగి వెళ్లండి
అడవిలో ఆర్టీసీ బస్సు నిలిపివేత: ప్రయాణికుల అవస్థలు

Photo Gallery
భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మోతుగూడెం-సీలేరు ప్రధాన రహదారి మధ్యలో భారీ వృక్షాలు కూలిపోవడంతో దట్టమైన అడవిలో చిక్కుకుపోయింది. అర్ధరాత్రి జోరున కురుస్తున్న వర్షంలో దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటల తరబడి సహాయం కోసం ఎదురుచూశారు.
అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, ప్రయాణికులు మరియు వాహన చోదకులే స్వయంగా నాలుగు గంటల పాటు శ్రమించి రోడ్డుపై అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించుకున్నారు.
Comments
Loading comments...