వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు వడ్డించేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. గుడ్ల నుంచి దుర్వాసన రావడంతో ఉపాధ్యాయులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.
ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎంఈఓ-2 రమేష్బాబు తెలిపారు. నిర్వాహకులను మార్చనున్నట్లు వెల్లడించగా, భోజన పథకంపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీఈఓ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...
