వార్తలకు తిరిగి వెళ్లండి

పశువులను రోడ్లపై వదిలేస్తున్న యజమానులకు విజయనగరం జిల్లా రాజాం CI నవీన్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు.
గురువారం మునిసిపల్ కమిషనర్ రామచంద్రరావుతో కలిసి రోడ్లపై పశువుల సంచారంతో ఏర్పడుతున్న సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా పశువులను రోడ్లపై వదిలితే గోశాలకు తరలించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

