వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్–నారాయణఖేడ్ ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారడంపై బీఆర్ఎస్ యువకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్డంతా గుంతలు, బురదతో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డుపైనే వరి నాటు వేసి నిరసన తెలిపారు. వెంటనే గుంతలను పూడ్చి శాశ్వతంగా రహదారిని అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

