Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
K Anuradha Aug 28, 2026 1:30 PM శ్రీకాకుళంGeneral
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - Udayam
పలాస జాతీయ రహదారిపై రాఖీ పండగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మాకన్నపల్లి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మామిడిమెట్టు గ్రామానికి చెందిన చెల్లూరు బైరాగి (60) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య దమయంతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...