వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట జమ్మూ జంక్షన్ సమీపంలోని హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వెళ్తున్న ఆటో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శ్రవణ్ కుమార్, వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్సై గణేష్ వెంటనే అంబులెన్స్ను రప్పించి క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

