వార్తలకు తిరిగి వెళ్లండి
జంటను బెదిరించి నగలు, ఫోన్లు చోరీ

తాడేపల్లి మండలం పెనుమాక వద్ద కృష్ణా కరకట్టపై ఓ జంటను బెదిరించి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రద్దీగా ఉండే కరకట్ట మార్గంలో ఇటీవల బెదిరింపు చోరీలు ఎక్కువవుతుండటంతో, మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...