వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖలో ఆదివారం తెల్లవారుజామున ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను భవానీశంకర్, రామాంజి, షేక్ మీరా, డ్రైవర్ శ్రీనుగా పోలీసులు గుర్తించారు. వీరంతా శ్రీకాకుళంలో జరిగే ఒక శుభకార్యానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...