వార్తలకు తిరిగి వెళ్లండి
రైవాడ రైతులకు బకాయిలు చెల్లించాలి

రైవాడ రైతులకు రావాల్సిన ₹169 కోట్ల బకాయిలను 15 రోజుల్లో చెల్లించకపోతే విశాఖకు తాగునీటి సరఫరా నిలిపివేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి హెచ్చరించారు. రైవాడ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు.
తాగునీటి కోసం 50 క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నా బకాయిలు చెల్లించకపోవడంపై జీవీఎంసీ వైఖరిని తప్పుబట్టారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...