వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో సాగునీరు అందుతుందనే ఆశతో ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 55 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు.
ప్రాజెక్టులు నిండి డెల్టాకు నీరు చేరేందుకు సమయం పడుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు అనుకూలిస్తే పంటలు గట్టెక్కుతాయని, లేకుంటే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

