వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీలో శానిటరీ ఇన్ చార్జ్ రామ్మోహనరావు ఆద్వర్యంలో బుధవారం స్వచ్చపథం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ పలు ప్రాంతాల్లోని రహదారులను చెత్త రహితంగా మార్చేందుకు ప్రతి బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రహదారుల ఇరువైపులా ఉన్న చెత్తకుప్పలు, పేడ దిబ్బలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే స్వచ్చపథం లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

