Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపాలెం బీసీ గురుకులంలో బాలుడి మృతి

Follow Udayam on Google
K.Venkatesh Sep 09, 2026 12:59 PM ఖమ్మంGeneral
రఘునాథపాలెం బీసీ గురుకులంలో బాలుడి మృతి - Udayam
రఘునాథపాలెం మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటలాడుతుండగా ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ (14) ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సాత్విక్ తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన హరీశ్, ప్రియాంక దంపతుల కుమారుడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...