వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో కుక్కకాటు కేసులు పెరుగుతున్నట్లు ఆఫీస్ సూపరింటెండెంట్ ఖాళీ చరణ్ తెలిపారు. మంగళవారం 16 మంది, బుధవారం సాయంత్రం 6 గం.ల వరకు మరో 16 మంది చొప్పున రెండు రోజుల్లో మొత్తం 32 మంది బాధితులు ఆసుపత్రికి వచ్చారన్నారు.
జమ్మూ, హడ్కో కాలనీ, పల్లేపేట, పోలాకి రహదారుల ప్రాంతాల్లో ఒకే కుక్క అందరినీ కాటేసినట్లు బాధితులు తెలిపారని, వారందరికీ తక్షణ వైద్యం అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

