వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి మండలంలోని 11/1 బ్రాంచ్ కాలువలో రైతులు స్వచ్ఛందంగా కలుపు మొక్కలను తొలగించారు. మోపిదేవి నుంచి వెంకటాపురం వరకు 3.5 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాలువ కింద 500 ఎకరాలకు పైగా సాగవుతోంది.
కాలువలో తూటికాడ తదితర కలుపు మొక్కలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో ఆయకట్టు రైతులు ముందుకొచ్చారు. గడ్డి జాతి మొక్కలను తొలగించి సాగునీటి ప్రవాహాన్ని మెరుగుపరిచారు.
Comments
Loading comments...

