వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పలు దగ్గర గ్రామాలలో మంజూరైన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. మొదటి విడతలో మండలానికి 757 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఎకో జోన్ పేరుతో ఇసుక దొరకకపోవడంతో లక్ష్యాన్ని సాధించలేకపోయారు.
కాగా రెండో విడతలో మండలానికి 332 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడంతో మరోసారి ఇసుక సమస్య తప్పేలా లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
Comments
Loading comments...

