వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధిత 22వ జాబితా నుంచి భూములను తొలగించేందుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించడం సరికాదని మెదక్ ఎంపీ రఘునందన్రావు ఎద్దేవా చేశారు. అసలు ఎంతమంది రైతులకు ఆ ఫారం నింపడం వస్తుందని ప్రశ్నించారు.
కనీసం రేవంత్రెడ్డికి కూడా ఆ ఫారం నింపడం సాధ్యమవుతుందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్లిష్టమైన నిబంధనలు కాకుండా రైతులకు సులభమైన పద్ధతిలో భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

