వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలని ముధోల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికీ నెలకు 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కేవలం ఒక కిలో బియ్యం ఇస్తూ సీఎం, మంత్రుల ఫోటోలు పెట్టుకోవడంపై మండిపడ్డారు. ప్రధాని ఫోటో పెట్టకపోతే ఊరుకునేది లేదని, బీజేపీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

