వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఆదివారం గూడూరు పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని గూడూరు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు.
సైదాపురం మండలం డేగపూడి వద్ద పైపులైను మరమ్మత్తుల కారణంగా అన్ని ప్రాంతాలకు నీరు సక్రమంగా సరఫరా కాదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి నీటిని పొదుపుగా వాడుకొని మున్సిపాలిటీకి సహకరించాలన్నారు.
Comments
Loading comments...

