వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మండలం రేపల్లె గ్రామంలో కులాంతర వివాహం నేపథ్యంలో మాదిగ కుటుంబాల ఇళ్లను కూల్చివేసిన ఘటనను MRPS ఊట్కూర్ మండల అధ్యక్షుడు కొండన్ భరత్ ఖండించారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలకు పోలీసు రక్షణ కల్పించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రఘువీర్ నాగరాజ్, అజయ్ తిమ్మప్ప, వి.శంకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

