వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతివనంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, సంస్థల ఉద్యోగులు పాల్గొని, రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం అక్కడ ప్రత్యేకంగా నిర్వహించిన సంస్మరణ సభలో రామోజీరావు ఆశయాలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియా, వ్యాపార రంగాల్లో ఆయన సృష్టించిన విప్లవాత్మక మార్పులను కొనియాడారు.
Comments
Loading comments...

