వార్తలకు తిరిగి వెళ్లండి
టెండర్లకే పరిమితమైన రామాలయ పనులు

ఒంటిమిట్ట కోదండ రామాలయ గోపురాలు, మండపాలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ. 96.85 లక్షల నిధులు మంజూరైనా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. టెండర్లు పూర్తయి మూడు నెలలు గడిచినా పురావస్తు శాఖ నిర్లక్ష్యంతో పనులు కాగితాలకే పరిమితమయ్యాయి.
వర్షం కురిస్తే ఆలయంలోకి నీరు చేరుతుండటంతో శ్రీవారి పోటులో సరుకులు తడిసిపోతున్నాయని, అధికారులు స్పందించి పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...