వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులకు పప్పు దినుసుల విత్తనాలు అందజేత

జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు పప్పు దినుసు పంటలను సాగు చేయాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పెసర, కంది, మినిము లాంటి పంటలను వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, పలు గ్రామాలు రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...