వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ భోజనం

చిత్తూరులోని సంజయ్ గాంధీ నగర్ అన్నా క్యాంటీన్ను సోమవారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆకస్మికంగా సందర్శించి, సామాన్య ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి, పరిమాణంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పేదలకు రూ.5కే భోజనం అందించే అన్నా క్యాంటీన్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...