వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 17 మంది రైతులకు బుధవారం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ ద్వారా 37 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 24 నివాస, 13 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి.
గతంలో వీధిపోటు, కోర్టు కేసులు మరియు భూసేకరణ ఎదురైన ప్రాంతాల్లో ప్లాట్లు పొందిన రైతుల విజ్ఞప్తులను పరిశీలించి, అర్హులైన వారికి ఈ ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించినట్లు సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

