Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
p.g.murthy Sep 03, 2026 1:27 PM మంచిర్యాలGeneral
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతుల సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేస్తామని నెల్కి వెంకటాపూర్ సహకార సంఘం నూతన చైర్మన్‌ ముత్యాల శ్రీనివాస్ అన్నారు. గురువారం మెదరిపేటలో మున్నూరు కాపు సంఘం నాయకులు, రైతులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రైతులు ఉన్నారు.

Comments

G
Loading comments...