Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సాగునీటి సమస్యలపై చర్చించిన నేతలు

Follow Udayam on Google
anji kummari Aug 12, 2026 5:23 PM మహబూబ్‌నగర్General
రైతుల సాగునీటి సమస్యలపై చర్చించిన నేతలు - Udayam
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి, ఎమ్మెల్యే లు మధుసూదన్ రెడ్డి, వేజేయుడు తదితరులు పాల్గొన్నారు. రైతులకు సాగునీరు అందించడం, ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యత, కాలువల నిర్వహణ, పెండింగ్లో ఉన్న సాగునీటి పనులు, పంటలకు అవసరమైన నీటి సరఫరా వంటి ప్రధాన అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...