వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లాలోని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు బియ్యం విక్రయిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రేషన్ లేదా ఆధార్ కార్డు చూపించి ఒక కుటుంబం 10 కిలోల వరకు స్టీమ్ లేదా పచ్చి బియ్యం తీసుకోవచ్చని చెప్పారు.
వంట నూనెలు, ఉల్లిపాయలను కూడా సబ్సిడీతో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

