వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ (APSDMA) హెచ్చరించింది. విజయనగరం, నెల్లూరు, కడప, చిత్తూరుతో పాటు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వానలు పడేటప్పుడు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

