Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో టెస్టుకు వర్షం ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:52 PM జాతీయంక్రీడలు
రెండో టెస్టుకు వర్షం ముప్పు - Udayam
కొలంబోలో ఆదివారం నుంచి భారత్‌-శ్రీలంక మధ్య జరగనున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. తొలి రోజు వర్షం కురిసేందుకు 60 శాతం అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఐదు రోజులపాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది. సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ పిచ్‌ తొలి రెండు రోజులు బ్యాటర్లకు, మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలించవచ్చని అంచనా.

Comments

G
Loading comments...