Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 12, 2026 3:22 PM హన్మకొండ General
పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్ - Udayam
హనుమకొండలోని కేఎస్‌ఆర్‌ కాలనీలో పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,290 నగదు, ఐదు మొబైల్‌ ఫోన్లు, పేక ముక్కలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సామగ్రిని హనుమకొండ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...